ఈ నూతన సంవత్సరంలో మీ ఆనందాలను మరింతగా పెంచడానికి విశాలాక్షి జనవరి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది. ఈ సంవత్సరం కానుకగా ప్రముఖ కథకులు శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారి ప్రత్యేక ముఖాముఖితోపాటుగా, ఆయన "మొండి శిఖండి" కథను విశాలాక్షి మీకు అందిస్తోంది. ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన శ్రీ డా.ఎమ్.సుగుణరావు గారి కథ "ధర్మ దేవత" ప్రచురితమైంది. అంతేకాకుండా మీ మనసు దోచుకునే మరిన్ని కథలు, ఆలోచింపజేసే కవితలు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కొత్త సీరియల్ "కల్యాణం కమనీయం" ప్రారంభం, పుస్తక పరిచయాలు, కోసూరు రత్నం గారి సంపాదకీయం, "సముద్రం" అనే అంశం మీద కథల పోటీల ప్రకటనలు, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...