విశాలాక్షి అక్టోబర్ 2023 సంచిక ఈ రోజు చూడగలిగాను, శిఖా ఆకాష్ గారి వాట్శాప్ ద్వారా .. అప్పుడప్పుడూ వాట్శాప్ యూనివర్సిటీ కూడా కాస్త పనికొచ్చే పనులు కూడా చేస్తుందనిపించింది. 50 పేజీల్లోనే పత్రిక వైవిధ్య భరితంగా ఉంది. చక్కటి శీర్షికలున్నాయి. కవిత్వం మీద మీ ప్రత్యేక శ్రద్ధ బాగా కనిపిస్తోంది. పత్రిక ద్వారా చాలా మందిని మళ్ళీ కలిసినట్లైంది. ప్రొ. గణేశ్వర రావు గారి కథా విశ్లేషణ శీర్షికలో ముకుంద రామారావు గారి కథను విశ్లేషించిన తీరు చెహోవ్ కథతో పోలిక బావుంది. కవి మణిందర్ గారితో విల్సన్ రావు గారి ఇంటర్వ్యూ లో మాణిక్యాల రావు గారు తన గురువుగారు ఫ్రముఖ కవి కీ శే ఎండ్లూరి సుధాకర్ గారిని గుర్తుచేసుకోవడం సముచితం. రామకవచం గారి కవితాస్త్రం లో ఆచార్య గోపీ గారి కవిత పరామర్శ శాస్త్ర బద్ధంగా ఉంది. బాలాజీ గారి కవిత పసి పిల్లలతో ఆడుకోవడం లో ఉండే మనసు తేలికవడాన్నీ, ఆనందాన్నీ, త్రుప్తినీ, ఫలితంగా జీవనం లో కలిగే పునరుత్తేజాన్నీ రుచి చూపించింది. గద్దర్ గారి మీద శిఖా ఆకాష్ కవిత, డా పద్మారావు గారి "వారే విజేతలు" కవితలో " వారు బహు ధ్వనులు బహుజనులు "అనే వ్యక్తీకరణ చాలా బావుంది. నా కవిత