నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో అక్టోబరు 29, 2023 ఆదివారం సాయంకాలం అంగరంగవైభవంగా విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక వార్షికోత్సవ సంబరాలు జరిగాయి. కథ, కవిత, మినీ కథ, కార్టూన్ పోటీలలో విజేతలైన వంద మంది సాహితీకారులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సభకు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహించారు. శ్రీ ఎమ్.వి. రామిరెడ్డి గారు, ప్రముఖ కవి, కథకులు, ఆత్మీయ అతిథిగా ప్రముఖ కథానవలా రచయిత్రి డాక్టర్ పెల్లకూరి జయప్రద సమావేశానికి విచ్చేసి అమూల్యమైన సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలోనే డాక్టర్ పాలంకి రాధిక, విశ్రాంత కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, చలంచెర్ల భాస్కరరెడ్డి, తెలుగు బాషోద్యమ నాయకులకు విశాలాక్షి పురస్కారాన్ని అందజేసారు. కోసూరు రత్నం, విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపకులు, విశాలాక్షి మాసపత్రిక ప్రచురణకర్త సభను ప్రారంభించారు. వృద్ధుల ఆశ్రమం ఇరవై యేళ్ల క్రితం స్థాపించిన సందర్భాన్ని, అలాగే పదమూడేళ్ల క్రితం స్థాపించిన విశాలాక్షి మాసపత్రిక ప్రచురించే క్రమంలో తన ప్రయాణాన్ని సభికులకు చెప్పారు. సంపాదకులు ఈతకోటి సుబ్బ