విశాలాక్షి ఆగష్టు 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది. డా.ఎన్.గోపి, రమణ వెలమకన్ని, చిత్రాడ కిషోర్ కుమార్, లోసారి సుధాకర్, సంధ్య శర్మ, దాశరాజు రామారావు, జ్యోతి మువ్వల, కలమట దాసుబాబు, దాసరి మోహన్, పేరూరు బాలసుబ్రహ్మణ్యం, గుండాల మహాలక్ష్మి, కరణం హనుమంతురావు గార్ల కవితలు... హేమలత, శింగరాజు శ్రీనివాసరావు, కొల్లా పుష్పరాణి, దాసరి చంద్రయ్య, కోనే నాగ వెంకట ఆంజనేయులు, వసుంధర, ఓట్ర ప్రకాష్ రావు గార్ల కథలు... శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు... శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'నిశాచరుడి దివాస్వప్నం' ఒక పంచభూతాత్మకం అంటోన్న శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారు... దినవహి సత్యవతి గారు నిర్వహిస్తోన్న 'పదలహరి'... ఈతకోట సుబ్బారావు గారు అందిస్తోన్న 'పలమనేరు బాలాజీ' గారి ముఖాముఖి... 'మహనీయుడు' గురించి చెప్తున్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం... లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...